హరిశంకర్ బ్రహ్మ
హరిశంకర్ బ్రహ్మ (జననం 1950 ఏప్రిల్ 19 [1] ) భారతదేశ 19వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు.[3][4] ఆయన 1975 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. [5]
హరిశంకర్ బ్రహ్మ | |
---|---|
19 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు | |
In office 2015 జనవరి 16[1] – 2015 ఏప్రిల్ 19[1] | |
అధ్యక్షుడు | ప్రణబ్ మిఉఖర్జీ |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ |
అంతకు ముందు వారు | వి.ఎస్.సంపత్ |
తరువాత వారు | నసీం జైదీ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1] గోసాయిగావ్, అస్సాం[2] | 1950 ఏప్రిల్ 19
కళాశాల | సెయింట్.ఎడ్మండ్స్ కాలేజి, షిల్లాంగ్ (బిఎ) గౌహతి యూనివర్సిటీ (ఎమ్ఎ) |
నైపుణ్యం | ప్రభుత్వ అధికారి |
2010 ఏప్రిల్ లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన బ్రహ్మ, [6] 2015 ఏప్రిల్ 19 వరకు పదవిలో ఉన్నాడు. JM లింగ్డో తర్వాత ఈశాన్య ప్రాంతం నుండి ఎన్నికల కమిషనర్ అయిన రెండవ వ్యక్తి అతను. [5]
ప్రారంభ జీవితం, విద్య
1950 ఏప్రిల్ 19 న అస్సాంలోని కోక్రఝార్ జిల్లాలోని గోస్సైగావ్లో బోడో కుటుంబంలో జన్మించిన అతను గౌహతి విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. షిల్లాంగ్లోని సెయింట్ ఎడ్మండ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. గౌహతిలోని డాన్ బాస్కో స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించాడు. అతను ఆంధ్ర ప్రదేశ్ కేడర్[7][2][8] కి చెందిన 1975 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.
కెరీర్
హరిశంకర్ బ్రహ్మ ఈ పదవిని చేపట్టడానికి ముందు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ సీనియర్ స్థాయి పదవులను నిర్వహించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ నుండి కార్యదర్శిగా పదవీ విరమణ చేసే ముందు బ్రహ్మ, జాయింట్ సెక్రటరీ (బోర్డర్ మేనేజ్మెంట్) వంటి పదవులను నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించాడు. ఇండో-పాక్ - ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో దాదాపు అన్ని సరిహద్దు ఫెన్సింగ్, ఇతర సరిహద్దు మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేశాడు. అతను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ )లో ప్రత్యేక కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు మెంబర్-సెక్రటరీగా పనిచేశాడు
- 4 సంవత్సరాలు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ ;
- కమిషనర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 న్నర సంవత్సరాలు;
- కమీషనర్ (రవాణా) & ఎక్స్-అఫిషియో సెక్రటరీ (రవాణా, రోడ్డు & భవనం), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2న్నర సంవత్సరాలు;
- కమిషనర్ & ఎక్స్-అఫీషియో సెక్రటరీ (ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాలు) 5 సంవత్సరాలు;
- ప్రిన్సిపల్ సెక్రటరీ (పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. [7]
2010 ఆగస్టులో ఎన్నికల కమిషనర్గా నియమితుడయ్యాడు. అతను రెండు లోక్సభ ఎన్నికలను (2014), ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలనూ పర్యవేక్షించాడు.[9]
2012 అస్సాం హింసపై అభిప్రాయాలు
2012 జూలై 28 న ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యాసంలో, 2012 అస్సాం హింసకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసలే కారణమని ఆరోపించాడు.[10] ఎన్నికల సంఘం కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొంటూ " భారత ఎన్నికల సంఘం కూడా ఈ సమస్య నుండి తప్పించుకోలేదు. అసోం ఎన్నికల జాబితాను సిద్ధం చేసేటపుడు, సుమారు 1.5 లక్షల మంది డి-ఓటర్ల (సందేహాస్పద ఓటర్లు) సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. ఈ సమస్య కోర్టుల పరిధిలో ఉంది. అది కూడా దేశానికి చాలా తీవ్రమైన భద్రతా ముప్పును కలిగిస్తుంది. కోర్టులు,. ట్రిబ్యునళ్లలో ఉన్న కేసులను ఒక కాలవ్యవధిలో పరిష్కరించాలి. అక్రమ వలసదారులుగా గుర్తించిన వ్యక్తులను పంపించెయ్యాలి. అక్రమ వలస అసమస్యను పరిష్కరించకపోతే, ఈ సమస్య పదేపదే వస్తూంటుంది, వివిధ ప్రాంతాల్లో వస్తూంటుంది" అని చెప్పాడు.[11]