శోభా కరంద్లాజే
శోభా కరంద్లాజే (ఆంగ్లం: Shobha Karandlaje; జననం 1966 అక్టోబరు 23) [3] ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె కర్ణాటక లోని భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలిగా, ఉడిపి చిక్ మంగళూరు లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యురాలు.[4] ఆమె కర్ణాటక ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉంది.ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్ యడ్ఐరోపాపకు సన్నిహితురాలు. ఆమె రాజకీయ ఎదుగుదలలో బి.ఎస్. యడ్ఐరోపాప ప్రోత్సాహం ఉంది.[5]
శోభా కరంద్లాజే | |
---|---|
![]() | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పుత్తూరు, కర్ణాటక | 1966 అక్టోబరు 23
జాతీయత | భారతీయురాలు |
చదువు | M.A. (Sociology), M.S.W.[1] |
కళాశాల | మంగుళూరు విశ్వవిద్యాలయం |
మారుపేరు | Shobhakka |
ప్రారంభ జీవితం
కోస్తా కర్ణాటకలోని పుత్తూరుకు చెందిన శోభ చాలా తక్కువ వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం కలిగి ఉంది, [6]
శోభ తన ఎం.ఎ. సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ను ఓపెన్ యూనివర్సిటీ, మైసూరు, స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ రోషిని నిలయ, మంగళూరు విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసింది.[ఆధారం చూపాలి]
రాజకీయ జీవితం
ఆమె 2008 మేలో బెంగళూరులోని యశవంతపుర నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనది, బి ఎస్ యడ్ఐరోపాప ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రిగా పనిచేసింది.
ఆర్ డిపిఆర్ మంత్రిగా ఆమెకు ప్రశంసలు వచ్చాయి. మంచి అడ్మినిస్ట్రేటర్ గా ప్రసిద్ధి చెందింది.[7] ఆమె జగదీష్ శెట్టర్ మంత్రిత్వ శాఖలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు.ఆహార, పర సరఫరాల శాఖ అదనపు బాధ్యతలు కూడా కలిగి ఉన్నారు. ఆమె బిజెపికి రాజీనామా చేసి, 2012 లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్ఐరోపాప ఏర్పాటు చేసిన కెజెపిలో చేరారు.[8] కెజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడింది.[9]
ఆ తర్వాత ఆమె ఉడిపి చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 1.81 లక్షల ఓట్ల తేడాతో గెలిచింది.2019 సార్వత్రిక ఎన్నికలలో ఆమె 7,18,916 ఓట్లను పొంది రెండవసారి గెలిచింది.[10][11]