వేముల ప్రశాంత్ రెడ్డి
వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, బాల్కొండ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1] ప్రస్తుతం కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నాడు.
వేముల ప్రశాంత్ రెడ్డి | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 సెప్టెంబర్ 8-2023 డిసెంబర్ 3 | |||
ముందు |
| ||
---|---|---|---|
ఎమ్మెల్యే, బాల్కొండ శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 2 జూన్ 2014 | |||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | వేల్పూర్ | 1966 మార్చి 14||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | సురేందర్ రెడ్డి, మంజుల | ||
జీవిత భాగస్వామి | నీరజారెడ్డి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | బాల్కొండ, సోమాజీగూడ |
జీవిత విషయాలు
ప్రశాంత్ రెడ్డి 1966, మార్చి 14న[2] సురేందర్ రెడ్డి, మంజుల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలంలోని వేల్పూర్ గ్రామంలో జన్మించాడు. బిఈ (సివిల్) చదివాడు.[3][4]
వ్యక్తిగత జీవితం
ప్రశాంత్ రెడ్డికి నీరజారెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు
2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పై 32,408 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[5][6] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ పై 36,248 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7]
2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా ఉన్నాడు.[8][9][10]