రైతు సమన్వయ సమితి
రైతు సమన్వయ సమితి, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సహకార సంస్థ.[2] ఈ కమిటీల ద్వారా గ్రామస్థాయిలో రైతు పెట్టుబడి సహాయ పథకం, రైతుబంధు పథకంలను పంపిణీ చేస్తుంటారు. తెలంగాణ శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గా ఉన్నాడు.[3][4]
స్థాపన | మార్చి 2018[1] |
---|---|
వ్యవస్థాపకులు | కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి |
రకం | వ్యవసాయ సహకార సంస్థ |
కేంద్రీకరణ | వ్యవసాయం |
కార్యస్థానం |
|
మూలాలు | Soyaben |
సేవా ప్రాంతాలు | తెలంగాణ |
ముఖ్యమైన వ్యక్తులు | చైర్మన్: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్సీ) |
ఉద్యోగులు | రైతు |
చరిత్ర
రైతులకు పథకాలు సక్రమంగా అందించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ కమిటీని ప్రకటించగా,[5] 2018 ఫిబ్రవరి 26న అమలులోకి వచ్చింది.
సంస్థ
రాష్ట్రంలోని 1,61,000 మంది రైతులు సభ్యులుగా ఈ సమితి ఏర్పడింది. వివిధ స్థాయిలలోని రైతు కమిటీలు:
- గ్రామస్థాయి - 15 మంది సభ్యులు
- మండలస్థాయి - 24 మంది సభ్యులు
- జిల్లాస్థాయి - 24 మంది సభ్యులు
- రాష్ట్రస్థాయి - 42 మంది సభ్యులు
రాష్ట్ర స్థాయి కమిటీలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ నిపుణులు, రైతులు ఉంటారు. ప్రభుత్వం ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది.
కార్పోరేషన్
లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభించబడిన కార్పోరేషన్లోని సభ్యులు వ్యవసాయ కార్యకలాపాలైన విత్తనాలను విత్తడం, ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అమ్మడం వంటి విషయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సివుంటుంది. రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, చర్చించుకోవడానికి, ఇతర రైతులతో అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతి 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున 2,630 రైతు సంఘ భవనాలు నిర్మించబడతాయి. 137 రైతు వేదికల నుండి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా పనిచేస్తాయి.
చైర్మన్లు
- గుత్తా సుఖేందర్ రెడ్డి - మార్చి 2018 నుండి ఆగష్టు 2019
- పల్లా రాజేశ్వర్ రెడ్డి - 17 నవంబర్ 2019 నుండి ప్రస్తుతం [6]