రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం

ఖమ్మం జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకం

రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, దుమ్ముగూడెం సమీపంలో ప్రతిపాదించబడిన ఎత్తిపోతల పథకం.[1] రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, ఇందిరాసాగర్ రుద్రమ్మకోట దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, దుమ్ముగూడెం నుండి సాగర్ టెయిల్ పాండ్ కెనాల్ ప్రాజెక్ట్ పేర్లతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అమలులో ఉన్నాయి.[2] రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం 17°54′05″N 80°52′45″E / 17.90139°N 80.87917°E / 17.90139; 80.87917 (Pamulapalli) వద్ద ప్రారంభమై, దుమ్ముగూడెం చెరువు నుండి గోదావరి నది నీటిని తీసుకుని ఖమ్మం, వరంగల్ జిల్లాలలో 200,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ పథకం ప్రణాళిక చేయబడింది. ఇందిరా దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం 17°33′49″N 81°14′49″E / 17.56361°N 81.24694°E / 17.56361; 81.24694 (Rudrammakota) వద్ద ప్రారంభమై, పోలవరం రిజర్వాయర్ వెనుక జలాల నుంచి గోదావరి నది నీటిని తీసుకుని ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 200,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ పథకం ప్రణాళిక చేయబడింది.

గోదావరిపై దుమ్ముగూడెం వాగు
నాగార్జున ఎడమ కాలువ డీప్ కట్

తెలంగాణ ప్రభుత్వం చేసిన రీడిజైనింగ్‌లో భాగంగా[3][4] రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, ఇందిరా సాగర్ రుద్రమకోట ఎత్తిపోతల పథకాలతో విలీనం చేయబడి, సీతారామ ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టబడింది. ఈ సాగునీటి పథకంలో నీటిని ఎత్తిపోసేందుకు సీతమ్మసాగర్ బ్యారేజీ పేరుతో 36.5 టిఎంసిల ప్రాజెక్టు కూడా రూపొందించబడుతోంది.

వివరాలు

దాదాపు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ఇండియా ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టను నిర్మించాడు.[5] నది నీటిని కాల్వలలోకి మళ్ళించడం కాకుండా లీన్ ఫ్లో సీజన్‌లో క్రాస్ ఓవర్ బ్రిడ్జ్‌గా ఉపయోగించడం కోసం ఇది నిర్మించబడింది. నదిని దాటడానికి భద్రాచలం పట్టణం సమీపంలో ఆల్ వెదర్ రోడ్డు వంతెన నిర్మాణం తర్వాత ఈ ఆనకట్ట ప్రాధాన్యత కోల్పోయింది. దుమ్ముగూడెం వాగుపై ఉన్న లెవెల్ డ్రాప్‌ను ఉపయోగించుకునేందుకు 24 మెగావాట్ల జలవిద్యుత్ స్టేషన్ కూడా నిర్మించబడింది.[6]

ప్రణాళిక

గోదావరి జలాలను కృష్ణానదికి అందించే రెండో భారీ నీటి పారుదల ప్రాజెక్టు ఇది. నాలుగు దశల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి 119 టి.ఎమ్‌.సి.ల నీటిని నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌కు తరలించబడుతాయి. దీని ద్వారా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు గోదావరి జలాలు ఈ ప్రాజెక్టు నుంచి సాగర్‌ టేల్‌పాండ్‌ వరకు 291 కిలోమీటర్ల దూరం వెళతాయి. దీని లింకు కాల్వల్లో కిన్నెరసాని, ముర్రేడువాగు, మున్నేరు, పాలేరు, మూసీ నదులు కలుస్తాయి.

దుమ్ముగూడెం చెరువు నుంచి కాలువ ప్రారంభమవుతున్నందున ఈ ప్రాజెక్టును దుమ్ముగూడెం నుండి సాగర్ టెయిల్ పాండ్ లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ లిఫ్ట్ కెనాల్ 165 టిఎంసి మేరకు దుమ్ముగూడెం చెరువు నుండి కృష్ణా నది పరీవాహక ప్రాంతానికి గోదావరి నది నీటిని అందిస్తుంది. కాలువ మొత్తం పొడవు 244 కి.మీ, కాలువ సామర్థ్యం 22,000 క్యూసెక్కులుగా ఉంది.[2]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ