బూర నర్సయ్య గౌడ్
బూర నర్సయ్య గౌడ్, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. వృత్తిరిత్యా వైద్యుడైన నర్సయ్య, లాప్రోస్కోపిక్, స్థూలకాయం, జీర్ణశయాంతర మొదలైనదానిలో వైద్యం చేశాడు. నరసయ్య 20,000 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు.
బూర నర్సయ్య గౌడ్ | |||
ఎంపి | |||
పదవీ కాలం 2014 - 2018 | |||
ముందు | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | కోమటిరెడ్డి వెంకటరెడ్డి | ||
నియోజకవర్గం | భువనగిరి | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | సూర్యాపేట, తెలంగాణ | 1959 మార్చి 2||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందు |
జననం - విద్యాభ్యాసం
బూర నర్సయ్య గౌడ్ 1959, మార్చి 2న తెలంగాణలోని సూర్యాపేటలో జన్మించాడు. అతను ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తిచేశాడు.
వృత్తి జీవితం
ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపిక్ సర్జరీ (HILLS) కి డైరెక్టర్ గా ఉన్నాడు. అందేకాకుండా ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్ లలో వైద్య సేవలు అందిస్తున్నాడు. బూర లక్ష్మయ్య, రాజమ్మ ఫౌండేషన్ ను స్థాపించి వ్యవస్థాపక చైర్మెన్ గా ఉంటూ పిల్లలు లేని జంటలకు ఉచిత లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్నాడు. తెలంగాణలోని గ్రామ ప్రాంతాలలో లాప్రోస్కోపిక్ సర్జరీపై అవగాహన కల్పిస్తున్నాడు.
రాజకీయ జీవితం
తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన టీఆర్ఎస్లో 2013 జూన్ 2న చేరి, 2014 లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందాడు. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ సభ్యుడిగా ఉన్నాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.[1][2][3][4]
బూర నర్సయ్య గౌడ్ 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[5] ఆయన 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు.[6][7]
2024 భారత సార్వత్రిక ఎన్నికల సందర్బంగా బీజేపీ 2024 మార్చి 02న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయగా భువనగిరి లోక్సభ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది.[8][9]
ఫెల్లోషిప్స్
బూర నర్సయ్య గౌడ్ వివిథ సంస్థలనుండి ఫెల్లోషిప్స్ పొందాడు.[10]
- ఫెల్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ సర్జన్స్ (ఎఫ్.ఎ.ఐ.ఎస్)
- ఫెల్లో ఇంటర్ నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఎఫ్.ఎ.సి.ఎస్)
- ఫెల్లో మినిమల్ ఆక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎమ్.ఎ.ఎస్)