బయ్యా నరసింహేశ్వరశర్మ

రాజకీయనేత

సర్ బయ్యా నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది, దాత. విశాఖపట్నంకు చెందిన నరసింహశర్మ 1913లో బాపట్లలో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ తొలి అధ్యక్షుడు. నరసింహేశ్వరశర్మ విశాఖపట్నం జిల్లా తుమ్మపాలలో 1867, జనవరి 6న జన్మించాడు. ఈయన తండ్రి మహాదేవ శాస్త్రి. శర్మ మెట్‌కాఫ్ స్కాలర్‌షిప్పుతో ఎఫ్.ఏ పూర్తిచేశాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుండి బి.ఏ ఉత్తీర్ణుడై, లా చదివి, 1898లో విశాఖపట్నం బార్ సంఘంలో చేరాడు.[1] కొన్నాళ్ళు కలకత్తాలో రైల్వే ధరల సిఫారుసు సంఘానికి అధ్యక్షునిగా పనిచేశాడు.

నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్యోద్యమంలోని మితవాద నాయకుల్లో ఒకడు. మాంటెగూ చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలను తిరస్కరిస్తూ అమృత్‌సర్ కాంగ్రేసు సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, శర్మ ఒక్కడే ప్రసగించాడు. ఈ ప్రసంగానికి మెచ్చి బ్రిటీషు ప్రభుత్వం ఈయన్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కాన్సిల్లో సభ్యత్వం ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెవెన్యూ సభ్యునిగా నియమించింది. రాజధానిని మార్చేందుకు స్థలం నిర్ణయించే సంఘంలో అనధికార సభ్యునిగా కూడా ఈయన్ను నియమించింది.[2]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ