పినరయి విజయన్
పినరయి విజయన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విజయన్ సీపీఎం నాయకుడు. ఆయన రెండొవసారి కేరళ ముఖ్యమంత్రిగా 20 మే 2021న భాద్యతలు స్వీకరించాడు. [3][4]
పినరయి విజయన్ | |||
12వ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
---|---|---|---|
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 25 మే 2016 | |||
గవర్నరు | పి.సతశివం ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ | ||
ముందు | ఊమెన్ చాందీ | ||
హోం మంత్రి | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 మే 2016 | |||
ముందు | రమేష్ చెన్నితాల | ||
శాసనసభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2 జూన్ 2016 | |||
ముందు | కేకే. నారాయణన్ | ||
నియోజకవర్గం | ధర్మదోమ్ నియోజకవర్గం | ||
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 మార్చి 2002 | |||
సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి | |||
పదవీ కాలం 25 సెప్టెంబర్ 1998 – 23 ఫిబ్రవరి 2015 | |||
ముందు | చదయాన్ గోవిందన్ | ||
తరువాత | కొడియేరి బాలకృష్ణన్ | ||
విద్యుత్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 20 మే 1996 – 19 అక్టోబర్ 1998 | |||
ముందు | జి. కార్తికేయన్ | ||
తరువాత | ఎస్.శర్మ | ||
సహకార శాఖ మంత్రి | |||
పదవీ కాలం 20 మే 1996 – 19 అక్టోబర్ 1998 | |||
ముందు | ఎంవీ.రాఘవన్ | ||
తరువాత | ఎస్.శర్మ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | పినరయి , మలబార్ జిల్లా, కేరళ రాష్ట్రం, భారతదేశం | 1945 మే 24||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం) | ||
జీవిత భాగస్వామి | టి. కమలమూస:పెళ్లి[1] | ||
సంతానం | 2 | ||
నివాసం | క్లిఫ్ హౌస్, తిరువనంతపురం, కేరళ | ||
పూర్వ విద్యార్థి | గవర్నమెంట్ బ్రేన్నెన్ కాలేజీ, తలాసేరి[2] |
జననం & విద్యాభాస్యం
పినరయి విజయన్ 1945, మే 24న కేరళ రాష్ట్రం, మలబార్ జిల్లా (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ), పినరాయి గ్రామంలో జన్మించాడు. విజయన్ తండ్రి మరోలి కోరన్, కల్లుగీత కార్మికుడు, తల్లి కళ్యాణి, గృహిణి. వారికి 14వ సంతానంగా ఆయన జన్మించాడు. ఆయన పెర్లాసరీ హైస్కూల్లో ప్రాథమిక విద్య, బ్రెన్నాన్ కాలేజీలో బీఏ పూర్తి చేశాడు.
వివాహం
పినరయి విజయన్ 1979లో కమల విజయన్ ను వివాహమాడాడు. కమల విజయన్ రిటైర్డ్ టీచర్. విజయన్ దంపతులకు ఇద్దరు సంతానం వీణ, వివేక్ కిరణ్, పి.ఎ.మొహమ్మద్ రియాస్ (అల్లుడు) ఉన్నారు.[5]
రాజకీయ జీవితం
విజయన్ పెరాలస్సెరీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆయన బ్రెన్నెన్ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నప్పుడే కన్నూరు జిల్లాలో విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు. ఆయన 1964లో కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ కన్నూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. 1964లో విజయన్ సీపీఎంలో సభ్యత్వం తీసుకున్నాడు. ఆయన జిల్లా కమిటీ, జిల్లా సెక్రటేరియట్లలో సభ్యునిగా బాధ్యతలతో పాటు పార్టీలో పలు పదవులు చేపట్టాడు. 1986లో కన్నూర్ జిల్లా సెక్రటరీగా ఎన్నికయ్యాడు. ఎమెర్జెన్సీ సమయంలో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపాడు. విజయన్ 25 ఏళ్ల వయసులో 1970లో కూతుపరంబ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 1998లో కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై ఈ పదవిలో 2015 వరకు కొనసాగాడు.
విజయన్ 2016 మే 25న కేరళ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మదోమ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.రఘునాధన్ (కాంగ్రెస్) పై 50,123 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.
ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు
సంవత్సరం | నియోజకవర్గం | ప్రత్యర్థి | మెజారిటీ (ఓట్లు) |
---|---|---|---|
1970 | కుతుపరంబ | తయత్ రాఘవన్ (ప్రజా సోషలిస్ట్ పార్టీ) | 743 |
1977 | కుతుపరంబ | అబ్దుల్ ఖాదర్ ( రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) | 4,401 |
1991 | కుతుపరంబ | పి.రామకృష్ణన్ (కాంగ్రెస్) | 12,960 |
1996 | పయ్యనూర్ | కేఎన్ కన్నోత్ (కాంగ్రెస్) | 28,078 |
2016 | ధర్మదం | మంబరం దివాకరన్ (కాంగ్రెస్) | 36,905 |
2021 | ధర్మదం | సి.రఘునాధన్ (కాంగ్రెస్) | 50,123 [6][7] |