దమోహ్
దమోహ్ మధ్యప్రదేశ్ లోని పట్టణం. ఇది దమోహ్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది సాగర్ పట్టనమ్ నుండి 80 కి.మీ. దూరంలో ఉంది. ఇది జైన మతస్థులకు తీర్థయాత్రా స్థలం అయిన కుందల్పూర్ (బడే బాబా ఆలయం) కు ప్రసిద్ధి చెందింది.
దమోహ్ | |
---|---|
పట్టణం | |
![]() | |
Coordinates: 23°50′N 79°27′E / 23.84°N 79.45°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | దమోహ్ |
విస్తీర్ణం | |
• Total | 10,000.35 కి.మీ2 (3,861.16 చ. మై) |
Elevation | 595 మీ (1,952 అ.) |
జనాభా | |
• Total | 1,26,219 |
• జనసాంద్రత | 148/కి.మీ2 (380/చ. మై.) |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 470661 |
టెలిఫోన్ కోడ్ | 07812 |
Vehicle registration | MP-34 |
భౌగోళికం
దమోహ్ 23°53′N 79°27′E / 23.88°N 79.45°E నొర్దేశాంకాల వద్ద [1] సముద్ర మట్టం నుండి 595 మీటర్ల ఎత్తున ఉంది .
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] దమోహ్ పట్టణంలో 1,12,160 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. దమోహ్ అక్షరాస్యత 73%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుష అక్షరాస్యత 89%, స్త్రీల అక్షరాస్యత 66%. జనాభాలో 14% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు
వాతావరణం
మూస:Damoh weatherbox
రవాణా సౌకర్యాలు
దమోహ్ నుండి అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది
దమోహ్ రైల్వే స్టేషన్ కట్ని, బినా జంక్షన్ మధ్య ఉన్న రైల్వే స్టేషను. ఢిల్లీ, ముంబై, జైపూర్, అమృత్సర్, హర్దా, హౌరా వంటి అన్ని భారతీయ నగరాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి.