గణపత్రావ్ దేవ్జీ తపసే
గణపత్రావ్ దేవ్జీ తపసే (30 అక్టోబర్ 1909[1] – 3 అక్టోబర్ 1992) భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య కార్యకర్త. ముంబాయులో జన్మించిన ఈయన మహారాష్ట్రలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీ నాయకుడు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ గా చేసారు.
దేవ్జీ ఫెర్గూసన్ కాలేజ్ లో, లా కాలేజ్ ఆఫ్ పూణేలో చదివారు. 1940లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్ళీ కొంత కాలం జైలు జీవితం గడిపారు. 1946, 1952 వరుస ఎన్నికలలో సతారా జిల్లా నుండి బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. అతను 3 ఏప్రిల్ 1962 నుండి 2 ఏప్రిల్ 1968[2] వరకు రాజ్యసభ సభ్యుడుగా చేసారు. తరువాత 1971 వరకు రైల్వే సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా వ్యవహరించారు. 2 అక్టోబర్ 1977 నుండి 27 ఫిబ్రవరి 1980[3] వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. తరిగి 28 ఫిబ్రవరి 1982 నుండి 14 జూన్ 1984 వరకు హర్యానా రాష్ట్ర గవర్నర్గా సేవలందించారు.
రచనలు
ముడ్హౌస్ టు రాజ్భవన్ - గవర్నర్ ఆత్మకథ (1983)