ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశం-2022
ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశం-2022ను కాన్ఫరెన్స్ ఆఫ్ UNFCCC గా లేదా COP27 అని పిలుస్తారు. 27వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం, షర్మ్లో 2022 నవంబరు 6 నుండి 2022 నవంబరు 18 వరకు జరుగుతుంది. ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ అధ్యక్షతన ఇది జరుగుతోంది. 90 కంటే ఎక్కువ మంది దేశాధినేతలు, 190 దేశాల నుండి 35,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఇది 2016 తర్వాత ఆఫ్రికాలో జరగబోయే మొదటి వాతావరణ సదస్సు.[1][2][3]
స్థానిక నామం | مؤتمر الأمم المتحدة للتغير المناخي 2022 |
---|---|
తేదీ | 6–18 నవంబరు 2022 |
ప్రదేశం | SHICC, షర్మ్ ఎల్ షేక్, ఈజిప్టు |
భౌగోళికాంశాలు | 27°56′42″N 34°21′48″E / 27.94500°N 34.36333°E |
నిర్వాహకులు | ఈజిప్టు |
ఉద్దేశ్యం
1992లో జరిగిన మొదటి UN వాతావరణ ఒప్పందం నుండి ఈ సమావేశం ఏటా నిర్వహించబడుతోంది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పరిమితం చేయడానికి, వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న ప్రభావాలకు అనుగుణంగా విధానాలను అంగీకరించడానికి ప్రభుత్వాలు దీనిని ఉపయోగించుకుంటాయి.
పాల్గొనే దేశాలు
ఈ సమావేశానికి దాదాపు 90 మంది దేశాధినేతలు, 190 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్, వాతావరణ ప్రతినిధి జాన్ కెర్రీ ఇద్దరూ హాజరవుతారని భావిస్తున్నారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరుకాబోతున్నారు.[4][5][6][7][8][9][10]