ఎగ్గే మల్లేషం
Jump to navigationJump to search
ఎగ్గే మల్లేషం | |||
![]() | |||
ఎమ్మెల్సీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మార్చి 30 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు | |||
---|---|---|---|
జననం | నాగోల్, ఉప్పల్ మండలం, హైదరాబాదు, తెలంగాణ | 1956 మే 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాములు, రాజమ్మ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీ స్వరూప | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె |
ఎగ్గే మల్లేషం తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు.[2][3]
జీవిత విషయాలు
మల్లేషం 1956, మే 5న రాములు, రాజమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాగోల్ జన్మించాడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసి వ్యవసాయరంగంలో పనిచేశాడు.[4]ఆయన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.[5]
వ్యక్తిగత వివరాలు
మల్లేషంకు లక్ష్మీ స్వరూపతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
రాజకీయరంగం
1981లో నాగోల్ గ్రామ పంచాయితీ మెంబరుగా పనిచేశాడు. 2019, మార్చి 30న టిఆర్ఎస్ పార్టీ తరపున శాసనసభ్యులచే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]
ఇతర వివరాలు
మలేషియా, సింగపూర్ మొదలైన దేశాలలో పర్యటించాడు.